శ్రీరాంపూర్, ఫిబ్రవరి 5: ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పా టు సంక్షేమానికీ ప్రాధాన్యం ఉంటుందని కొత్త డైరెక్టర్లు వెంకటేశ్వర్రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీని వారు ఆదివారం సందర్శించారు. ముందుగా ఓసీపీ మైసమ్మ ఆలయం వద్ద జీఎం సంజీవరెడ్డి, పీవో పురుషోత్తంరెడ్డి, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మల్లారెడ్డి, ఇన్చార్జి పిట్ కార్యదర్శి కందుల శంకర్ స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఓసీపీ పీవో ఆఫీస్లో అధికారులతో ఓసీపీ ఉత్పత్తి, ఉత్పాదకతపై, క్వారీ లో కోల్ నిల్వలపై సమీక్షించారు. అనంతరం ఓసీపీ క్వారీలోకి దిగి పని స్థలాలు సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో నే సంస్థ మరింత అభివృద్ధి చెందుతున్నదన్నారు.
సింగరేణి సంస్థ రానున్న ఐదేండ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నదని చెప్పారు. తమను సంస్థ డైరెక్ట ర్లుగా నియమించిన సీఎం కేసీఆర్, సీఅండ్ఎండీ శ్రీధర్కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాతోనే సింగరేణి లో తన ప్రస్థానం మొదలైందని డైరెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆర్కే 6 గని మేనేజర్, ఎస్సార్పీ 3 మేనేజర్, ఆర్కే 7 గ్రూప్ ఏజెంటుగా శ్రీరాంపూర్లో సేవలందించానని చెప్పారు. డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శ్రీరాంపూర్కు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎస్వోటూజీఎం త్యాగరాజు, రీజియన్ సేఫ్టీ జీఎం జాన్ఆనంద్, ఏరియా ఈఈ రమేశ్ బాబు, ఏవీ రెడ్డి, డీవైజీఎం చిరంజీవులు, ఐకే ఓసీ పీవో శ్రీనివాస్, ఇన్చార్జి మేనేజర్ వీరయ్య, ఈఈ సారంగపాణి, సర్వే ఆఫీసర్ రామ్మోహన్, సీనియర్ పీవో శంకర్, ఆలయ కమిటీ సభ్యులు మోహన్, శ్రీనివాస్, మదన్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
డైరెక్టర్లను సన్మానించిన టీబీజీకేఎస్ నాయకులు
సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 5: కొత్త డైరెక్టర్లు వెంకటేశ్వర్రె డ్డి, ఎన్వీకే శ్రీనివాస్ను టీబీజీకేఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శ్రీరాంపూర్ పర్యటనకు వచ్చిన వారిని సీసీ సీ సింగరేణి అతిథి గృహంలో ఆదివారం టీబీజీకేఎస్ ఏరి యా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో నా యకులు మర్వాదపూర్వకంగా కలిశారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, ఏరి యా చర్చల ప్రతినిధులు పెట్టం లక్ష్మణ్, వెంగల కుమారస్వామి, నాయకులు తొంగల రమేశ్, పానుగంటి సత్త య్య, అన్వేశ్రెడ్డి, మహేందర్రెడ్డి, గోపాల్రెడ్డి, రత్నాకర్ రెడ్డి, వెం కటేశ్వర్లు, ఎంబడి తిరుపతి, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
గోదావరిఖని, ఫిబ్రవరి 5: కొత్తగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్(పీపీ) జీ.వెంకటేశ్వర్ రెడ్డిని ఆదివారం ఆర్జీ-1 ఏరియా అధికారుల సం ఘం నాయకులు కలిశారు. ఈ మేరకు స్థానిక ఇల్లందు క్లబ్ లో వారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీ-1 ఏరియా స్థితి గతులు, పురోగతిపై చర్చించారు. అధికారుల సంఘం అధ్యక్షుడు పో నుగోటి శ్రీనివాస్, కార్యదర్శి డేవిడ్, ఉపాధ్యక్షుడు డా.మధుకుమార్, జాయింట్ సెక్రటరీ దీటి చంద్రమౌళి, తిరుపతి రె డ్డి, శ్రావణ్కుమార్, వీరారెడ్డి ఉన్నారు.
డైరెక్టర్లు జీ.వెంకటేశ్వర్ రెడ్డిని ఆర్జీ-1 జీఎం కే.నారాయ ణ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అ భిషేకాలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు డైరెక్టర్లను శాలువాతో సత్కరించారు. నాయకులు దాసరి రాయలింగు, చం ద్రమౌళి, వీరారెడ్డి ఉన్నారు.
క్రషర్ ప్రారంభం
జైపూర్, ఫిబ్రవరి 5 : ఇందారం ఓపెన్ కాస్టు గనిలో క్ర షర్ యంత్రాన్ని ఆదివారం డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజె క్ట్స్) జీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యంత్రం ఇందారం ఓసీకి తల మానికంగా నిలవబోతున్నదన్నారు. అలాగే వేర్వేరు సైజుల్లో బొగ్గును పంపడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి (డైరెక్టర్) ఎన్వీకే శ్రీనివాస్, శ్రీ రాంపూర్ జీఎం సంజీవ రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్య క్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా సీఎంవో ఏఐ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ ఖాదీర్, జీఎం త్యాగరాజు, బెల్లంపల్లి రీజియన్ జీఎం జాన్ ఆనంద్, బ్రహ్మాజీ రావు, నాగన్న, పెట్టం లక్ష్మణ్, కుమారస్వామి, రత్నాకర్ రెడ్డి, అ ధికారులు తదితరులు పాల్గొన్నారు.