ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలకు ఎంపికైంది. ఈనెల 16,17 తేదీల్లో పీహెచ్సీని ఢిల్లీ బృందం సభ్యులు పరిశీలించారు. సౌకర్యాలు, సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండడంతో ఎంపికైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు. రాష్ట్రంలో నాలుగు పీహెచ్సీలు ఎంపికవగా.. ఉమ్మడి జిల్లాలోని తాంసి పీహెచ్సీ ఆరు విభాగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చి.. 90.64 శాతం మార్కులు సాధించింది.
– తాంసి, ఆగస్టు 28