మంచిర్యాల (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/ మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 8: మంచిర్యాల జిల్లాలో కలకలం సృష్టించిన మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్య ఘటనలో భర్తపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులు, గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించడం, సెక్షన్ల కింద ఆయనను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కాగా, తమ బిడ్డ మృతికి అల్లుడే కారణమని జ్యోతి తల్లిదండ్రు లు ఆరోపించారు. అదనపుకట్నం కోసం బాల కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ బిడ్డను వేధిస్తున్నారని, ఇది తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం అనంతరం జ్యోతి మృతదేహాన్ని ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సీతరామపురం గ్రామానికి తీసుకెళ్లారు.
మంచిర్యాలలో కలకలం సృష్టించిన జ్యోతి ఆత్మహత్య కేసులో పోలీసులు ఆమె భర్త అయిన మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై వేధింపులు, గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. కాగా, బుధవారం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానలో పోస్టుమార్టం అనంతరం కుటంబసభ్యులకు ఆమె మృతదేహాన్ని అప్పగించారు. బాలకృష్ణ సొంత గ్రామమైన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం కేశవపురం తీసుకెళ్తామని వారి కు టుంబ సభ్యులు కోరారు. ఇందుకు జ్యోతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రత్యేక వాహనంలో జ్యోతి పుట్టినూరు ఖమ్మం జిల్లా కొనిజర్ల మం డలం సీతరామపురం గ్రామానికి తీసుకెళ్లారు. కాగా కమిషనర్ బాలకృష్ణ గతంలో కానిస్టేబుల్గా ఉన్నప్పుడు జ్యోతితో వివాహమైంది. పెళ్లి అయ్యాక మూడేళ్లు గ్రూప్స్నకు ప్రిపేరయ్యాడని, ఆ సమయంలో తామే పోషించామని జ్యోతి తల్లిదండ్రులు వాపోయారు.
బాలకృష్ణ కమిషనర్ అయ్యాక, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.5 కోట్లు కట్నం వచ్చేదని, తనకు అదనపు కట్నం ఇవ్వాలంటూ వేధించేవాడని ఆరోపించా రు. ఇళ్లు కట్టుకుంటామంటే కూడా డబ్బులు ఇచ్చేందుకు తాము ఒప్పుకున్నామని చెప్పారు. జ్యోతి సంకాంత్రి పండుగకు పుట్టింటికి వచ్చిందని, ఆ సమయంలో అల్లుడు వేరొకరిని ఇంటికి తీసుకొచ్చినట్లు పొరుగున ఉండేవారు చెప్పిన ట్లు తమ బిడ్డ చెప్పిందన్నారు. దీంతో వేధింపు లు, గొడవలు ఎక్కువయ్యాయని పదిహేను రో జుల నుంచి రోజూ ఫోన్ చేసి తనను చంపేందు కు బాలకృష్ణ పథకం వేస్తున్నాడని చెప్పిందన్నా రు. మంగళవారం ఉదయం కూడా ఫోన్ చేసి నన్ను చంపేస్తాడమ్మ మీరు వచ్చి తీసుకెళ్లండని చెప్పిందని పేర్కొన్నారు.
మధ్యాహ్నానికి జ్యోతి అన్యాయం చేసి వెళ్లిపోయిందని బాలకృష్ణ ఫోన్ చేసి చెప్పాడని తల్లి చెప్పింది. ఇంట్లో ఏం జరిగినా ఆమ్మ, పిన్ని, తమ్ముడు, ఆడబిడ్డకు చెప్పేవాడని, వారు చెప్పినట్లే వేధించేవాడని ఆరోపించారు. బాలకృష్ణను కఠినంగా శిక్షించి తమ బిడ్డకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ప్రాథమిక నిర్ధారణ ప్రకారం జ్యోతిది ఆత్మహత్యగానే భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లోపల గడియ పెట్టుకొని ఉరి వేసుకొవడంతో, ఇరుగు, పొరుగు వారి సహకారంతో బాలకృష్ణ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లినట్లు తెలిపారు. జ్యోతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుగుణాకర్ తెలిపారు. కమిషనర్ బాలకృష్ణను ప్రస్తుతం పోలీసుల రిమాండ్లో ఉం చారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.