మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరో ఘనతను దక్కించుకుంది. ఈ ఏడాది గ్రీన్ టెక్ ఎన్విరాన్ మెంట్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు అసోంలోని గౌహతిలో బుధవారం ఈ అవార్డును విద్యుత్ కేంద్రం ప్రతినిధులు అందుకున్నారు. అధికారులు, కార్మికుల సమష్టి కృషి ఫలితంగానే ఈ గుర్తింపు దక్కిందని అధికారులు స్పష్టం చేశారు.
జైపూర్, ఆగస్టు 24 : సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.. మరో అవార్డు తన ఖాతాలో వేసుకున్నది. పర్యావరణ పరిరక్షణలో ఈ పవర్ప్లాంట్ కృషిని గుర్తించిన ‘గ్రీన్ టెక్ ఫౌండేషన్’, అస్సాంలోని గౌహతిలో ఈ నెల 23, 24 తేదీల్లో జరిగిన జాతీయ సమావేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ అవార్డును ప్ర కటించింది. ఈ ఫౌండేషన్ ద్వారా సింగరేణి థర్మ ల్ పవర్ప్లాంట్కు కాలుష్య నియంత్రణ, యం త్రాలు, సామగ్రి (పొల్యూషన్ కంట్రోల్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్) విభాగంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. జైపూర్ పవర్ ప్లాంట్ తరఫున సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులు, గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ చీఫ్ సెక్రటరీ రవిశంకర్ ప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా బుధవారం గౌహతిలో అవార్డును అందుకున్నారు.
గతంలో విద్యుదుత్పత్తిలో అతి తక్కువ నెట్ హీట్ రేట్ను నమోదు చేసినందుకు 2021-22కు గాను దక్షిణ భారత స్థాయిలో బెస్ట్ ఎనర్జీ ఎఫీషియెంట్ ప్లాంట్గా ఎంపికై, గోవాలో అవార్డు అందుకున్నది. అలాగే ఫ్లైయాష్ యుటిలైజేషన్లో ఉత్తమ ప్లాంటుగా అవార్డు సొంతం చేసుకున్నది. అస్సాంలో జరిగిన సమావేశాల్లో ఎస్టీపీపీ తరఫున ఈ అవార్డును అందుకున్న వారిలో జీఎం (ఈఅండ్ఎం) డీవీ సూర్యనారాయణరాజు, చీఫ్ ఆఫ్ ఓఅండ్ఎం జైన్సింగ్, ఎస్వోటూ సీటీసీ ప్రభాకర్ ఉన్నారు. ఈ అవార్డు పొందడానికి కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు జీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇదే కృషిని కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని జీఎం పిలుపునిచ్చారు.