హాజీపూర్, మే 26 : హాజీపూర్ మండలం దొనబండ గ్రామ శివారులోని శిలాఫలకాన్ని ఇటీవల కూల్చి వేశారు. 2023 అక్టోబర్ 7న పడ్తన్పల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి అప్పటి నీటి పా రుదల మంత్రి తన్నీరు హరీశ్రావు దొనబండ గ్రామ శివారులో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఇటీవల ఆ ప్రాంతంలో ఓ రియల్ ఎస్టే ట్ వ్యాపారి వెంచర్ను ఏర్పాటు చేసి కంచె వేశాడు. అయితే తన వెంచర్కు అడ్డుగా శిలా ఫలకం ఉందని కూల్చివేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ను ఏర్పాటు చేయడమేగాకుండా శిలాఫలకాన్ని కూల్చి వేయడం ఏమిటని ప్రజలు మండిపడుతున్నారు.