నిర్మల్ అర్బన్, జనవరి 12 : క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా క్రీడల్లో రాణిస్తే ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 9వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఉమెన్స్ బాలికల సాఫ్ట్బాల్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను గురువారం మంత్రి ప్రారంభిం చారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా కారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలోని 20 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీలకు హాజర య్యారు. వారిని మంత్రి పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తున్నదని పేర్కొన్నారు. పాఠ శాల స్థాయి నుంచి విద్యార్థులు క్రీడల పై దృష్టి సారించేలా కృషి చేస్తున్నదని తెలిపారు.
వివేకానందుడు ఆదర్శప్రాయుడు
నిర్మల్ అర్బన్, జనవరి 12 : భారత దేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వివేకానందుడు ఆదర్శప్రాయుడు అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని వివేకానంద చౌక్లోని వివేకానంద విగ్రహా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. నిర్మల్లోని స్వామి వివేకానంద విగ్రహం కూడలిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయా చోట్ల అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సి పల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, అడ్ప విజయలక్ష్మి, లక్కాకుల నరహరి, నరేందర్, నాయకులు నర్సయ్య, సయ్యద్ ముషీ రొద్ద్దీన్, నిర్వాహకురాలు అన్నపూర్ణ పాల్గొన్నారు.