ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గిరిజనులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు. వీరికి పట్టాలు పంపిణీ చేయడానికి సర్కారు చర్యలు వేగవంతం చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. జిల్లాలో కో-ఆర్డినేటర్ కమిటీలను కూడా నియమించింది. జిల్లా కమిటీలో చైర్మన్గా జిల్లా ఇన్చార్జి మంత్రి, కన్వీనర్గా కలెక్టర్ ఉంటారు. అధికారిక సభ్యులుగా జిల్లా ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోడు భూములు సాగు చేస్తున్న 66,004 మంది రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోడు భూముల పంపిణీ ప్రక్రియ వేగవంతం కావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అటవీ భూములు సాగు చేస్తున్న రైతు ల సమస్యల పరిష్కారం కోసం సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా అటవీ శాఖ బీట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీ ఆర్ఏలు గ్రామాల్లో పర్యటించి ఫారెస్ట్ రైట్స్ కమి టీ సభ్యుల సమక్షంలో దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై అవగాహన కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, ఇతర రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో 1,08,959 ఎకరాల అటవీ భూమిలో వ్యవసాయం జరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 56,140 ఎకరాలు, నిర్మల్లో 19,543, మంచిర్యాలలో 8,276, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 25,000 ఎకరాల్లో పోడు వ్యవసాయం జరుగుతున్నట్లు దరఖాస్తుల స్వీకరణకు ముందుగా నిర్ధారించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఆధార్, ఫోన్, రేషన్కార్డు నంబరు, జీవిత భాగస్వామి పేరు, తండ్రి, తల్లి పేరు, చిరునామా, గ్రామంలో హక్కు కోరుతున్న భూమి వివరాలు, ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అర్జీదారు, అర్జీదారుని కుటుంబ సభ్యులు పేర్లు, వయస్సు, అటవీ భూమి విస్తీర్ణం, స్వ యంగా సాగు చేస్తున్నది, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న వివరాలు తెలియజేయడంతో పా టు గ్రామపెద్దల వాగ్మూలం కాపీని జత పర్చారు.
66,004 దరఖాస్తులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 66,004 మంది రైతులు పోడు భూముల్లో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు జిల్లాల్లో 2,27, 129 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తున్నట్లు దరఖాస్తుదారులు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 33,885 మంది గిరిజన రైతులు 1,24, 522 ఎకరాలు, 32,119 ఇతర రైతులు 1,02, 507 ఎకరాలకు హక్కు పత్రాల కోసం అర్జీలు దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 11,172 మంది గిరిజనులు 44,120 ఎకరాలకు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,177 మంది గిరిజన రైతులు 51,859 ఎకరాలకు, నిర్మల్ జిల్లాలో 5076 మంది రైతులు 14,955 ఎకరాలకు, మం చిర్యాల జిల్లాలో 4,460 మంది రైతులు 13, 587 ఎకరాల కోసం దరఖాస్తులు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 7,172 మంది ఇతర రైతు లు 28,472 ఎకరాలకు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,503 మంది రైతులు 44,267 ఎకరాల కోసం, నిర్మల్ జిల్లాలో 3590 మంది 10, 037 ఎకరాలకు, మంచిర్యాల జిల్లాలో 73 14 మంది రైతులు 19,830 ఎకరాల కోసం దరఖా స్తు చేసుకున్నారు. గిరిజన, ఇతర రైతుల దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు.
జిల్లా కమిటీ ఏర్పాటు
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పోడు భూముల సమస్యపై చర్చించి ప్రణాళిక రూపొందించారు. అటవీ హక్కు పత్రాల పంపిణీలో భాగంగా జిల్లాలవారీగా కమిటీలను ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కమిటీలో జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, కలెక్టర్ కన్వీనర్గా, జిల్లా ఉన్నతాధికారులు అధికారిక సభ్యులుగా, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. అర్హులైన వారికి పట్టాల పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు అటవీభూములు అక్రమణకు గురికాకుం డా పకడ్బందీ చర్యలు తీసుకుంటారు.