హాజీపూర్, జనవరి 7 : గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రిషాంక్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ షేరు శ్రీధర్ తెలిపారు. ఇటీవల నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో నిర్వహించిన ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి అండర్-14 కబడ్డీ పోటీల్లో రిషాంక్ ప్రతిభకనబరిచాడని.
ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జనగామాలో జరిగే ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మంచిర్యాల జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తాడని తెలిపారు. ఈ మేరకు రిషాంక్తో పాటు వ్యాయామ ఉపాధ్యాయుడు కొట్టె దేవేందర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సహాయ ప్రిన్సిపాల్ రోనాల్డ్ కిరణ్, డిప్యూటీ వార్డెన్ సందీప్ కుమార్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.