ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం కనుల పండువగా కొనసాగాయి. చిన్నారుల కృష్ణుడు, గోపిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. యువతీయువకులు కూడళ్ల వద్ద ఉట్టికొట్టే కార్యక్రమాలను వైభవంగా నిర్వహించగా.. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖులు కూడా ఉట్టికొట్టే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 7 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తులు వైభవంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న సతీమణి రమాదేవితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట జల బావి వద్ద వేద పండితుల మధ్య జలానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారి కృష్ణులతో కలిసి ఉట్టికొట్టారు. భక్తులతో ఎమ్మెల్యే దంపతులు ప్రసాదానికి పోటీపడ్డారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పూర్ణానంద స్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ప్రమోద్, బండారి దేవన్న పాల్గొన్నారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో..
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 7 : జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధర్మం వైపే నిలబడాలన్న శ్రీ కృష్ణతత్వాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, తద్వారా మెరుగైన సమాజ నిర్మాణానికి పాటు పడాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా పట్టణ ప్రధాన వీధుల గుండా డీజేచప్పుళ్ల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ కృష్ణుని విగ్రహాన్ని అందంగా అలంకరించిన వాహనంలో ఉంచి శోభాయాత్ర చేపట్టారు. అనంతరం స్థానిక సంఘం భవనం వద్ద నిర్వహించిన వేడుకల్లో భాగంగా చిన్నారుల శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. అనంతరం చిన్నారులు ఉట్టి కొట్టి సందడి చేయగా ఎమ్మెల్యే చిన్నారులతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో మాజీ ఎంపీ నగేశ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, ప్రముఖ హోమియోపతి వైద్యులు రవికిరణ్ యాదవ్, యాదవ సంఘం జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, రమేశ్ యాదవ్, సురేందర్, ప్రఫుల్ పాల్గొన్నారు.
దస్తురాబాద్, సెప్టెంబర్ 7 : మండలంలో గురువారం ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రీ కృష్ణాజన్మాష్ట మి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండ ల కేంద్రంలోని లక్ష్మి నరసింహ స్వామి, వేంకటే శ్వర స్వామి, ఆలయాలు, రేవోజిపేట సీతారామా లింగేశ్వరి స్వామి ఆలయంలో అర్చకులు నరేశా చార్యులు, కొండమాచార్యులు, వంశీకృష్ణ చార్యు లు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారుల కృష్ణుడు, గోపిక వేషధారణ పలువురిని ఆకట్టుకున్నాయి.
ఖానాపూర్లో..
ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 7 : మండలం లోని పలు గ్రామాలలో కృష్ణాజన్మాష్టమిని ఘనం గా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో కృష్ణుడికి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అక్కడ ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. చిన్నారులు శ్రీకృ ష్ణుని వేషధారణతో ఆకట్టుకున్నారు. చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఉట్నూర్ మండలంలో..
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 7 : మండలం లోని గ్రామాల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏంకా పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేష ధారణతో ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. అనం తరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ గణేశ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చడం ద్వారా మెథోశక్తి, దైవ భక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధర్మేందర్, గ్రామస్తులు రాధాబాయి, ఆషాబాయి, శశికలబాయి, మల్లుబాయి, లక్ష్మి, సావిత్రి, సుమ, నాందేవ్, దత్త, విద్యార్థులు పాల్గొన్నారు.
పెంబిలో..
పెంబి, సెప్టెంబర్ 7: మండల కేంద్రంలోని విజన్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో నిర్వహించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో ఉట్టి కొట్టించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యు డు శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.