సీసీసీ నస్పూర్, ఆగస్టు 12 : సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 16వ తేదీన తక్షణ ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్లో 34 సీట్లు, కంప్యూటర్ సైన్స్లో 2 సీట్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో 22 సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్లో 32 సీట్లు, మైనింగ్ ఇంజినీరింగ్లో 31 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
ఇతర కాలేజీల్లో సీటు పొందిన విద్యార్థులు సీటు రద్దు చేసుకొని రావాలని, లేకపోతే ఇక్కడ సీటు కేటాయించరాదని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్లో సీటు వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్ వర్తించదని తెలిపారు. వివరాలకు www.scpolytechnic.com వెబ్సైట్ చూడాలని, సింగరేణి, సింగరేణేతర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.