ఆటస్థలాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం
ఇప్పటికే పల్లోల్లో భూముల గుర్తింపు షురూ..
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించింది. ప్రకృతి వనా లు, వైకుంఠధామాలు ఏర్పాటు చేసింది. అలా గే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను అందించింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు తగిన గర్తింపునివ్వడంతో పాటు వా రిలోని క్రీడా సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేలా క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దనున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గ్రామాల్లో స్థలాల ఎంపిక కోసం చర్యలు చేపట్టారు.
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండలకేంద్రాల్లో, ఉన్నత పాఠశాలల్లో తప్ప గ్రా మాల్లో సరైనా ఆటస్థలాలు ఎక్కడా లేవు. దీం తో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడానైపుణ్యం గల యువకులు, చిన్నారుల ప్రతిభ మరుగున పడిపోతున్నాయి. కబడ్డీ, వాలీబాల్ వంటి ఆటలు ఆడేందుక కూడా స్థలాలు లేవు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో స్థలాలు ఉన్నప్పటికీ వా టిని క్రీడా మైదానాలుగా అభివృద్ధి చేయకపోవడంతో ఉపయోగపడకుండా పోతున్నాయి. ప్రతి గ్రామ పరిధిలో క్రీడా స్థలాల కోసం ఎ కర నుంచి రెండు ఎకరాల భూమిని గుర్తించి వాటిని క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఉపాధి హామీ ద్వారా వాటి పను లు చేపట్టనున్నారు. గతంలోనే ప్రభుత్వ స్థలాలను గుర్తించిన అధికారుల వాటిని క్రీడా మై దానాలకు కేటాయించనున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.