ఉట్నూర్, అక్టోబర్ 4 : గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఐటీడీఏ పీవో చాహత్బాజ్పాయ్ సూచించారు. ఉట్నూర్లోని కుమ్రం భీం కాంప్లెక్స్ మైదానంలో బుధవారం నిర్వహించిన ఆశ్రమ పాఠశాలల జోనల్ స్థాయి క్రీడాపోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులు ఇటీవల రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటడం ఆదర్శమన్నారు.
ఆసియా క్రీడల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చదివిన నందిని అథ్లెటిక్స్ భారత్కు ఆడడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్లో ఆశ్రమ పాఠశాలల గిరిజన విద్యార్థులు సైతం ఆస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీడీ ఎం దిలీప్కుమార్, ఏపీవో ఆత్రం భాస్కర్, డీటీడీవో అంబాజీ, గిరిజన క్రీడల అధికారులు కోరెడ్డి పార్థసారథి, రమేశ్, ఏసీఎంవోలు జగన్, శివాజీ, ఏటీడీవోలు క్రాంతికుమార్, నిహారిక, అమిత్, పీడీలు హేమంత్, దేవ్రావ్, శంకర్, ఉత్తమ్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.