ఆదిలాబాద్, మే 31 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడకు చెందిన శిశువులను విక్రయించిన కేసులో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో బుధవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పది నెలల కిందట బంగారిగూడకు చెందిన గంగాధర్ భార్య రాధా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి అనారోగ్యంతో మరణించింది.
కర్ణాటక రాష్ర్టానికి చెందిన శీతలే రమ, ఆమె కూతురు సిందే కోమల్ ‘పిల్లులు లేని వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారికి పిల్లలు కావాలి’ అని ఆదిలాబాద్లో ఆర్ఎంపీగా పనిచేస్తున్న జగన్నాథ్కు సూచించారు. ఆయన తన మిత్రుడు షారూఖ్కు ఈ విషయం చెప్పగా.. గంగాధర్ వద్ద ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలుసుకున్నారు. షారూఖ్ పిల్లలను దత్తత ఇవ్వాలని కోరాడు. ఇందుకు ఆయన డబ్బులు అడుగగా, ఈ విషయాన్ని ఆర్ఎంపీ జగన్నాథ్కు సూచించాడు. ఈ విషయాన్ని జగన్నాథ్ కర్ణాటకలో శీతలే రమ, కోమల్కు తెలియజేశాడు. రూ.2.50 లక్షలకు పిల్లలను అమ్మడానికి గం గాధర్ ఒప్పుకున్నాడు. చిన్నారులతో పాటు ఆయన తమ్ముడు అశోక్, అక్క గంగమ్మ, అత్త గంగమ్మ కలిసి కారులో కర్ణాటకలోని కుంటకార్వా గ్రామానికి వెళ్లారు. అక్కడ ఓ లాడ్జిలో రమ, కోమల్, గజానంద్కు గంగాధర్ చిన్నారులను అప్పగించి వారి నుంచి రూ.2.40 లక్షలు తీసుకున్నాడు.
ఆదిలాబాద్కు తిరిగివచ్చి ఆ డబ్బులతో టాటా ఎస్ ట్రాలీ కొనుగోలు చేశాడు. పిల్లల అమ్మకం విషయంలో శిశుసంక్షేమ శాఖ అధికారులకు వేరే వ్యక్తులు ఫిర్యాదు చేయగా.. ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నాగనాథ్ ఆధ్వర్యంలో కర్ణాటకకు బయలుదేరి విచారణ చేపట్టారు. అక్రమంగా చిన్నారులను కొనుగోలు చేసినందుకు గానూ కర్ణాటకకు చెందిన శీతలే రమ, గజానన్ బాల బాల్గి, రాజ్కుమార్ దొడ్డ గిరియప్పా, ఆదిలాబాద్కు చెందిన ఆర్ఎంపీ షిండే జగన్నాథ్, షారూఖ్, గంగాధర్, అశోక్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇద్దరు చిన్నారులను శిశుగృహ సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసులో నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులకు ఎస్పీ అవార్డులు అందజేశారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్, సీఐ రఘుపతి, ఎస్ఐ నాగనాథ్, సిబ్బంది ఉన్నారు.