ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 24 : నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. బుధవారం ఆసిఫాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నెల వారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధనతో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని, స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని సూచించారు.
ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించాలని, ప్రమాదాల సంఖ్య తగ్గేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో గంజాయి, పేకాట, గుడుంబా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా కోర్టులో పెండింగ్లోనున్న కేసుల పరిషారం కోసం కృషి చేసిన పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అచేశ్వరారవు, డీఎస్పీలు కరుణాకర్, రమేశ్, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.