ఆసిఫాబాద్, ఫిబ్రవరి 22: పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న వారికి క్రీడలు శారీరకంగా, మానసికంగా ఎంతో దోహదపడుతాయని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందికి క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ, విరామాల సమయాల్లో క్రీడలకు సమయం కేటాయించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో మన జిల్లా కు పథకాలు తీసుకురావడానికి, మెరుగైన ప్రతిభ చూపేందుకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసి సిబ్బందిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, టాస్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్ తదితరులున్నారు.
బదిలీపై వెళ్తున్న సీఐకి సన్మానం
సీసీఎస్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు సిద్దిపేట కమిషరేట్కు బదిలీ కావడంతో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సురేశ్ కుమార్ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, టాస్ఫోర్స్,స్పెషల్ బ్రాంచ్ సీఐ రాణాప్రతాప్, ఆసిఫాబాద్ సీఐ సతీశ్, డీపీవో ఏవో శ్రీనివాస్, ఫింగర్ ప్రింట్ విభాగం సీఐ మారండేయ , ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, ఆర్ఐ ఎంటీవో అంజన్న, ఎస్ఐలు రామకృష్ణ, వెంకటేష్, మహేందర్, ఆర్ఎస్ఐలు ఓదెలు, కిరణ్ తదితరులున్నారు.