బెల్లంపల్లిరూరల్, మార్చి 25 : బెల్లంపల్లి మండలంలోని దుగినెపల్లి రహదారిపై ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో కొడుకు మృతి చెందగా.. తల్లి తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి. గురిజాల మాజీ సర్పంచ్ దుగుట తిరుపతి కుమారుడు దుగుట అజయ్ (24) తన తల్లి లలితతో కలిసి దుగినెపల్లి శివారులోని తమ పొలం వద్దకు సోమవారం సా యంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో అక్కడి వెంచర్లో మట్టిని అన్లోడ్ చేసి ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుగుట అజ య్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తల్లి లలిత కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తాళ్లగురిజాల పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ లలితతోపాటు అజయ్ మృతదేహాన్ని తమ వాహనంలోనే బె ల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లలిత పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు మంచిర్యాలకు తరలించా రు. మృతి చెందిన అజయ్ హైదరాబాద్లో చదువుకుంటున్నాడని, కొద్ది రోజుల కిందటే గ్రామానికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.