టౌన్/మందమర్రి/రెబ్బెన/జైపూర్/కాసిపేట, డిసెంబర్ 23: మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి గనులు, ఓసీపీలు, ఏరియా కేంద్రాల్లో సంస్థ 101వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు హాజరై, వేడుకల్లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు.శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్లో, ప్రగతి స్టేడియంలో జీఎం ఎం సురేశ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి సంస్థ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. సంస్థ రక్షణ, ఉత్పత్తి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నదని చెప్పారు. శ్రీరాంపూర్ ఓసీపీలో పీవో పురుషోత్తంరెడ్డి, మేనేజర్ జనార్దన్ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు. ఆర్కే 7, ఆర్కే 5, 5బీ, ఆర్కే 6 గనులపై అధికారులతో పాటు గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు. జైపూర్లోని ఎస్టీపీపీలో చీఫ్ టెక్నికల్ సహాయకుడు సంజయ్కుమార్ ష్యూర్ పతాకావిష్కరణ చేశారు. ఇతర అధికారులు పాల్గొన్నారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో పతాకాన్ని జీఎం చింతల శ్రీనివాస్ ఆవిష్కరించారు. వివిధ స్టాళ్లను ఏరియా అధికారులు, గుర్తింపు సంఘం నాయకులతో కలసి ప్రారంభించారు. ఏరియా జీఎం కార్యాలయంలో కేక్ కట్ చేశారు. గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మేడిపల్లి సంపత్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కాసిపేట గనిపై గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, మేనేజర్ అల్లాఉద్దీన్ జెండా ఆవిష్కరించారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్షిప్ శ్రీ భీమన్న క్రీడా మైదానంలో ఏరియా జీఎం సంజీవరెడ్డి జెండావిష్కరణ చేశారు. స్టాళ్లను ప్రారంభించారు. సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కోవాలి : సీఎండీ శ్రీధర్
బొగ్గు పరిశ్రమకు ప్రైవేట్ నుంచి తీవ్రమైన పోటీ ఉంటుందని, సింగరేణి కార్మికులు, అధికారులు, యూనియన్ నాయకులు సమష్టిగా ఉంటూ ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ సీఎండీ శ్రీధర్ సూచించారు. సింగరేణి డే సందర్భంగా గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి జెండాను ఎగరేశారు.
కొత్తగూడెంలో స్టాళ్ల ప్రారంభం..
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను డైరెక్టర్(పా) బలరాం ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను పరిశీలించారు. ఉదయం ఆర్జీ-3 ఏరి యా ఓసీపీ-1లో డంపర్ను ఢీకొట్టి మృతిచెందిన కలిశె ట్టి శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని శ్ర ద్ధాంజలి ఘటించారు. డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖ ర్, డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరా వు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ పాల్గొన్నారు.