నిర్మల్ అర్బన్, జనవరి 16 : జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన తైక్వాండో సౌత్ ఇండియా చాంపియన్షిప్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రి అభినందించారు. ఈ ఏడాది జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీలు నిర్మల్లో నిర్వహించే అవకాశం లభించడంపై అభినందించారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు సదుపాయాలు కల్పించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు శ్రీకాంత్ యాదవ్, తేజేందర్ సింగ్ బాటియా, అమ్ముల భూషణ్, శ్రీకాంత్, రాజశేఖర్, వంశీ, దీపిక, పూనమ్, నరేశ్ న్నారు.
సోన్, జనవరి 16 : నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామ ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘ భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేయనున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణంలోని తన నివాసంలో కలిసిన వెంగ్వాపేట్ గ్రామ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ సభ్యులతో మంత్రి మాట్లాడారు. సంఘ భవన నిర్మాణానికి నిధుల విడుదలకు హామీ ఇచ్చిన మంత్రిని నాయకులు సన్మానించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తొడిశెట్టి శంకర్, మైల గంగాధర్, కార్యవర్గ సభ్యులు నాగభూషణ్, విజయ్, సతీశ్, రవికాంత్, చంద్రశేఖర్, రాజేశ్వర్, చంద్రాగౌడ్, సుకుమార్, రాజశేఖర్, చిన్నయ్య, మధుసూదన్, నవీన్రెడ్డి, గంగన్న, లింగన్న, సాయన్న పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, జనవరి 16: మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని నిర్మల్ జిల్లా ఓడు కులస్తులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఓడు కుల సంఘం క్యాలెండర్ను మంత్రి విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంచార కులాలను గుర్తించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలి పారు. తమ సంఘం అభ్యున్నతికి కృషి చేయాల ని మంత్రికి విన్నవించారు.రాష్ట్ర అధ్యక్షుడు పవార్ కైలాస్, నాయకులు సంతోష్, తిరుపతి, సంజీవ్, అశోక్, నాందేవ్, ఆకాశ్, శేఖర్ పాల్గొన్నారు.