తాంసి, మే 28 ః ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొజ్జాన్గూడ గిరిజన గ్రామంలో 15 బోర్లు అడుగంటిపోయాయి. దీంతో భగీరథ నీరు అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం గుట్ట మీద ఉండడంతో రోజు గ్రామస్తులు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి కింద బోరు నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు.
సర్పంచ్ మడావి ఆశిక్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తాగునీరు అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే తాంసి మండలంలోని అంబుగాం, అట్నం గూడ, గిరిగామ, లీంగూడ గ్రామాల్లో నెలలో 15 రోజులు భగీరథ నీరు రావడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే భగీరథ నీరు అందించాలని వారు కోరుతున్నారు.