అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. ఇప్పటికే మూడుసార్లు వేతనాలు పెంచిన ప్రభుత్వం.. రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికితోడు సర్వీస్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు, ప్రమాద బీమా 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షలు, వయసు మీరిన వారికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని నిర్ణయించింది.
దురదృష్టవశాత్తు సర్వీసులో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20 వేలు, హెల్పర్లకు రూ.10 వేల సాయం అందించనుంది. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయడం, రిటైరయ్యాక ఆసరా పెన్షన్లు ఇస్తామనడంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– మంచిర్యాల, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ)
సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ టీచ ర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది. దేశంలోనే అంగన్వాడీలకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే.. కాగా వారి కోసం మంగళవారం మరో జీవో జారీ చేసి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంగన్వాడీల రిటైర్మెంట్ వయస్సును 65 ఏండ్లకు పెంచడమే కాకుండా.. దేశంలో ఎక్కడాలేని విధంగా పదవీ విరమణ సమయంలో వారి సేవలకు గుర్తింపుగా ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. ఉద్యోగ విరమణ చేసే టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ. 50 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దురదృష్టవశాత్తు సర్వీసులో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20 వేలు, హెల్పర్లకు రూ.10 వేల సాయం అందించనుంది. అంతేకాకుండా టీచర్లు, సహాయకుల్లో 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, 50 ఏం డ్లు దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించా రు. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయడం, రిటైరయ్యాక ఆసరా పెన్ష న్లు ఇస్తామనడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడుసార్లు అంగన్వాడీల వేతనాలు పెంచిన ఘనత, అంగన్వాడీలకు అత్యధిక వేతనాలు ఇస్తున్నది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీలు నిరాదరణకు గురవ్వగా తెలంగాణలో కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారు. 2015లోనే అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.4,200 నుంచి రూ.7 వేలకు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనం రూ.2,200 నుంచి రూ.4,500లకు పెంచిన ముఖ్యమంత్రి 2017లో మరోసారి టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.6 వేలకు పెంచారు. మూడో సారి 2021లో టీచర్ల వేతనాన్ని రూ.13,650 చేయగా మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.7,800లకు పెంచి వారికంటూ ఓ గుర్తింపును కల్పించారు. అంగన్ వాడీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తాజా ఉత్తర్వులతో ఆనందంలో మునిగిపోయారు.
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 13 : ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను పట్టించు కున్నోళ్లు లేరు. మాతో వెట్టి చేయించారే తప్ప మా బాగోగుల గురించి ఆలోచించలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బతుకుల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మా కష్టాలను చూసి మూడుసార్లు జీతాలు పెంచారు. మాకు, మా కుటుంబాలకు అండగా నిలిచారు. అంతేగా కుండా దేశంలోనే ఎక్కువ జీతాలు ఇస్తుంది కూడా కేసీఆర్ సారే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కూడా ఈయనే. మినీ అంగన్వాడీ లను అప్గ్రేడ్ చేయడం అభినందనీయం. ఉద్యోగ విరమణ తర్వాత మాకు ఆసరా పింఛన్ ఇస్తామని ప్రకటించారు. మాకు వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు, మంత్రి సత్యవతి రాథోడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పిర్సింగుల సురేఖ, జిల్లా కార్యదర్శి, అంగన్ వాడీ హెల్పర్ యూనియన్ సంఘం (బీఆర్టీయూ), మంచిర్యాల
ఎదులాపురం, సెప్టెంబర్ 13 : మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. విరమణ తర్వాత ఆసరా పింఛన్ వర్తింపజేయడంతో పాటు 50 ఏళ్లలోపు వారికి రూ.2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని సర్కారు నిర్ణయించడం బాగుంది. నేను త్వరలో ఉద్యోగ విరమణ చేస్తున్న. నాకు ఆసరా పింఛన్ వస్తది. మా కుటుంబానికి భరోసానిచ్చిన సీఎం కేసీఆర్ను మరిచిపోలేను. – కే.రాధ, అంగన్వాడీయూనియన్ జిల్లా అధ్యక్షురాలు, ఆదిలాబాద్
నిర్మల్ చైన్గేట్, సెప్టెంబర్ 13 : అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ అంగన్వాడీ సిబ్బంది ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్తోపాటు ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచడం హర్షణీయం. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రూ. ఒక లక్ష, హెల్పర్లకు రూ. 50 వేల సాయం కల్పించడంతోపాటు ఆసరా పింఛను, ప్రమాద బీమా కల్పిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్కు కృతజ్ఞతలు.
– అరుణ. టీఎన్జీవో అంగన్వాడీ యూనియన్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
నిర్మల్ చైన్గేట్, సెప్టెంబర్ 13 : గత ప్రభు త్వాలు చేయని విధంగా తెలంగాణ ఏర్ప డ్డ తర్వాత అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెన్ఫిట్స్తోపాటు ఆసరా పింఛను కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం మంత్రి సత్యవతి రాథోడ్ జీవో విడుదల చేయడం హర్షణీయం. అంతేగాక మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం సంతోషకరం. మినీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం వల్ల కేంద్రానికి ఒక హెల్పర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బందికి ఆత్మగౌరవం లభించింది.
– వరలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు, టీఎన్జీవో అంగన్వాడీ యూనియన్
ఎదులాపురం, సెప్టెంబర్ 13 : ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ హెల్పర్లకు పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ సార్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం భరోసానివ్వడంతో పండుగ వచ్చినట్ల య్యింది. మున్ముందు మరింత శ్రద్ధగా విధులు నిర్వహిస్తాం. గత ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలు, కార్యకర్తలు, హెల్పర్లను అసలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నరు.
– కవిత, అంగన్వాడీ టీచర్, శాంతినగర్, ఆదిలాబాద్