బెల్లంపల్లి రూరల్, ఫిబ్రవరి 14 : అక్రమంగా తరలిస్తున్న ఏడు టేకు దుంగలను బుధవారం అటవీ అధికారులు పట్టుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లికి ఏపీ 39 యూబీ 4078 నంబర్ గల కారులో టేకు దుంగలు తరలిస్తున్నారని అటవీ శాఖ అధికారులకు పక్కా సమాచారం అందింది.
దీంతో వారు కారును పట్టుకుని టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.35 వేల వరకు ఉంటుంది. ఎఫ్ఆర్వో సుభాష్, డిప్యూటీ ఎఫ్ఆర్వో గౌరీశంకర్, ఎఫ్ఎస్వో శ్రీనివాస్ దాడుల్లో పాల్గొన్నారు. పట్టుబడ్డ కారు, టేకు దుంగలను అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.