నిర్మల్ చైన్గేట్, జనవరి 19 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట, ద్యాగవాడ, కురాన్పేట, బంగల్పేటలో గురువారం ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అంధత్వ నిర్మూలనే ధ్యేయంగా రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారన్నారు. అధునాతన సాంకేతిక మిషన్ల ద్వారా కంటి పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. అందుకు జిల్లాలో 32 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలో నిత్యం 400 మందికి పరీక్షలు చేసి, ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఆర్డీవో స్రవంతి, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, వైద్యాధికారులు రాజేందర్, శ్రీనివాస్, సురేశ్, కౌన్సిలర్లు సబిత శ్రీధర్, పూదరి రాజేశ్వర్, బిట్లింగ్ నవీన్, నిగులపు పోశెట్టి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, జిల్లా కంటి వెలుగు ప్రత్యేకాధికారి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఏపీడీ ఓస ప్రసాద్, వైద్యాధికారి శ్రీకాంత్, లక్ష్మణచాంద, చామన్ పల్లి, పార్పెల్లి సర్పంచులు ముత్యంరెడ్డి, గంగాధర్, రాజేంధర్, బీఆర్ఎస్ మండల కన్వీర్ కృష్ణారెడ్డి, నర్సాపూర్ ఎంపీటీసీ గణేశ్, నాయకులు గంగారాం, రమేశ్, శ్రీనివాస్, నరేశ్రెడ్డి, గురాల లింగారెడ్డి, రాంరెడ్డి, మహిపాల్ రెడ్డి, మహేశ్, ప్రభార్, సురేశ్ పాల్గొన్నారు.