చెన్నూర్ టౌన్, జనవరి 14 : సంక్రాంతి పండుగ సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన వేడుక మొదటి రోజు భోగితో మొదలు కాగా, శుక్రవారం కనుమ పండుగ నిర్వహించేందుకు పల్లె, పట్నం సిద్ధమైంది. సోమవారం సంక్రాంతి. సకల సౌభాగ్యాల పండుగ. సూర్యుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
దీనికి ముందు రోజు భోగితో మూడు రోజుల వేడుక మొదలైంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునే భోగి మంటలు వేశారు. అనంతరం ముగ్గులు వేసి భోగి వేడుకలు నిర్వహించారు. చెన్నూర్లో జగన్నాథాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై, స్వామిని దర్శించుకున్నారు.
దండేపల్లి, జనవరి14: దండేపల్లి మండల కేంద్రం తో పాటు మాదాపూర్లో ఆదివారం భోగి సంబురాలను ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల ఏసీసీ, జనవరి 14 : మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి వేడుకలు జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టణ వాసులు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వెలిగించి వాటి చుట్టూ తిరిగి డీజే పాటలతో ఆటలతో సందడి చేశారు.
వేమనపల్లి/కోటపల్లి/చెన్నూర్ రూరల్/ భీమారం, జనవరి 14 : పలు మండలాల్లో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు.