ఎదులాపురం, ఫిబ్రవరి 28 : సమాజంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బాలికలు, యువతులు ఈవ్టీజింగ్కు గురవుతూనే ఉన్నారు. బాధితులకు అండగా నిలవడంతో పాటు సమస్యలపై స్పందించేందుకు సఖీ కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాల కేంద్ర ఆవరణలో సఖీ భవనం ఉంది. వివిధ రకాల బాధితులకు ఇక్కడ రక్షణ కల్పిస్తున్నారు. సెంటర్లో మహిళా పర్యవేక్షకురాలు(సెంటర్ అడ్మినిస్ట్రేటర్) అందుబాటులో ఉంటూ బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. న్యాయపరంగా అండగా నిలిచేందుకు న్యాయవాది, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా సేవలందిస్తున్నారు. బాధితురాలికి ప్రమాదం ఉంటే సఖీ కేంద్రంలోనే వసతి కల్పిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 2017 డిసెంబర్ 15న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళా సమస్యలపై ఈ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నది. బాధితులకు అన్నీతామై నిలిచి రక్షణ కల్పిస్తున్నది. సెంటర్లో మహిళా పర్యవేక్షకురాలు(సెంటర్ అడ్మినిస్ట్రేటర్) నిత్యం అందుబాటులో ఉంటూ బాధితులకు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కుంగిపోకుండా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనేందుకు న్యాయవాది, జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ద్వారా బాధితులకు సేవలు అందుతాయి. ఒకవేళ మహిళలు గాయపడినా, ఆరోగ్య సమస్యలు ఉన్నా వారి కోసం అంబులెన్స్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కేంద్రంలో ఒక నర్స్ మహిళలకు వైద్య సాయం అందించేలా ఏర్పాట్లు చేశారు. బాధితురాలికి ఎవరినుంచైనా ప్రమాదం ఉంటే సఖీ కేంద్రంలోనే కొన్ని రోజులు ఉండేలా వసతి కూడా కల్పిస్తారు.
సేవలపై విస్తృత అవగాహన ..
సమాజంలో వేధింపులకు గురవుతున్న మహిళలకు తగిన న్యాయం అందించేందకు గాను ఉమెన్ హెల్ప్లైన్ పేరిట టోల్ఫ్రీ నంబర్ 181 ఏర్పాటైంది. బాధితులు సఖీ కేంద్రానికి రాలేని పరిస్థితిలో ఉంటే వారిని ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. సఖీ కేంద్రం సిబ్బంది, అధికారులు మహిళలకు చట్టాలపై అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సమైక్య సంఘాల పరిధిలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో వాల్ పోస్టర్లు , బ్రోచర్లు పంచుతున్నారు.
సఖీ కేసులు సంఖ్య