ఎదులాపురం, జూలై 24: జైలులోని ఖైదీల భద్రత చాలా ముఖ్యమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ జిల్లా జైల్లో సోమవారం జైల్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హాజరైన ఎస్పీకి జైలు సూపరింటెండెంట్ పీ అశోక్ కుమార్ పూలమొక్కను అందజేసి ్వగతం పలికారు. ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందజేస్తున్న భోజనం, జైలు పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ సందర్భంగా ఖైదీలు కోర్టులకు, హాస్పిటల్స్ వెళ్తే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు పెరోల్ రిపోర్ట్పై సమీక్ష నిర్వహించారు. కోఆర్డినేషన్ మీటింగ్ ఎంతగానో దోహదపడుతుందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.