ఎదులాపురం, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆర్టీసీ డీఎం కల్పన పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస్టాండ్ పరిసరాల్లో చెత్తాచెదారం తొలగించారు. కార్యక్రమంలో సీఐ విశ్వనాథ్, ఎంఎఫ్ రాజేందర్, ఎస్ఎం రాములు, కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్ విలాస్ పాల్గొన్నారు.
తాంసి, జూన్ 5 : చెట్లే జీవరాశి మనుగడకు ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు అందరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని వైస్ఎంపీపీ ముచ్చ రేఖ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొన్నారి గ్రామంలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బండి విజయ్కుమార్, ఉప సర్పంచ్ అశోక్, నాయకులు సంజీవ్, రమణ, లింగన్న, అంగన్వాడీ టీచర్ దేవమ్మ పాల్గొన్నారు.
బేల, జూన్ 5 : మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ఎంపీపీ వనితాఠాక్రే, అధికారులు చెత్తాచెదారం తొలగించారు. మార్కెట్ కూడలీలో తిరుగుతూ పర్యావరణంపై అవగాహన కల్పించారు. వ్యాపారస్తులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో అరుణ, ఎంపీడీవో మహేందర్ కుమార్, సీనియర్ ఆసిస్టెంట్ మహిపాల్ రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్, జూన్ 5 : పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని బోథ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ అన్నారు. సోమవారం పొచ్చెర జలపాతం వద్ద మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ఎఫ్డీవో బర్నోబా, ఎఫ్ఆర్వో ప్రణయ్, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో జీవన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మాణ్సింగ్, సర్పంచ్లు మల్లేశ్, సురేందర్యాదవ్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి పంద్రం శంకర్, న్యాయవాదులు హరీశ్, కుమ్మరి విజయ్, అటవీ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
నేరడిగొండ, జూన్ 5 : మండలంలోని కుంటాల జలపాతం పరిసర ప్రాంతాల్లో సిరిచెల్మ అటవీ రేంజ్ అధికారి వాహబ్ అహ్మద్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను తొలగించారు. పర్యాటకులకు పర్యావరణ ప్రాధాన్యతపై వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి అమర్సింగ్, కుంటాల సెక్షన్ అధికారి వసంత్కుమార్, ఎఫ్బీవో సచిన్, సందీప్, సంతోష్, డ్రైవర్లు పాల్గొన్నారు.
మొక్కలతోనే మనిషికి మనుగడ
ఉట్నూర్, జూన్ 5 : మొక్కలతోనే మనిషికి మనుగడ ఉంటుందని ఉట్నూర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉట్నూర్ కోర్టు ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో న్యాయవాదులు గిరి, జైవంత్రావ్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకృతిని, పచ్చదనాన్ని కాపాడుకుందాం
ఉట్నూర్ రూరల్, జూన్ 5: ప్రకృతిని, పచ్చదనాన్ని కాపాడుకుందామని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. సోమవారం మండలంలోని ఘన్పూర్ గ్రామంలో మొక్కలు నాటారు.
సీపీఎఫ్ ఆధ్వర్యలో…
సీపీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని తుకారాంనగర్ గ్రామంలో ఐటీడీఏ ఉద్యానవన అధికారి సందీప్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుకాబాయి శంభు, సీపీఎఫ్ సంస్థ సీనియర్ ప్రోగ్రాం అధికారి సత్యనారాయణ, సీపీఎఫ్ కోఆర్డినేటర్లు మంగ, రవి, న్యాను, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 5: మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అటవీ శాఖ అధికారులతో కలిసి సర్పంచ్ కోరెంగా గాంధారి మొక్కలు నాటి నీరుపోశారు. ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొక్కల సంరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో సంతోష్, జీవ వైవిధ్య మండలి జిల్లా కోఆర్డినేటర్ సోన్కాంబ్లే గోపీనాథ్, డిప్యూటీ ఎఫ్ఆర్వో విజయానంద్ రెడ్డి, ఎఫ్ఎస్వోలు రాజేందర్, నర్సయ్య, ఈవో సంజీవరావ్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, అటవీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
నార్నూర్, జూన్ 5 : పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో కావల రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్, ఈజీఎస్ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ గంగాసింగ్, జూనియర్ అసిస్టెంట్ రాజేందర్, టెక్నికల్ అసిస్టెంట్ వికాస్ చౌహాన్, పంచాయతీ కార్యదర్శులు శేఖర్, రమేశ్, ఫీల్డ్ అసిస్టెంట్లు బాపురావ్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
పర్యావరణంతోనే మంచి భవిష్యత్
నార్నూర్, జూన్ 5 : పర్యావరణంతోనే అందరికీ మంచి భవిష్యత్ ఉంటుందని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాన్కాపూర్ గ్రామంలోని ఆలయ ప్రాగంణంలో జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అలాగే తాడిహత్నూర్ గ్రామంలో ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రూప్దేవ్, జై భారత్ జిల్లా సమన్వయకర్త దీపక్, భీంరావ్, తాడిహత్నూర్ ఉప సర్పంచ్ ఫడ్ విష్ణు, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు సత్యవర్ధన్, బాపురావ్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.