నార్నూర్, డిసెంబర్ 1 : పంచాయతీల అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామముఖ ద్వారం ఏర్పాటుకు గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నెలనెలా నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. పంచాయతీ నిధులతో గ్రామాల్లో వసతులు కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడంలో సర్పంచుల కృషి హర్షణీయమన్నారు.
పంచాయతీ నిధుల్లో రూ.5 లక్షలతో గ్రామ ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నార్నూర్ పంచాయతీ పరిధిలో సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్ చేపడుతున్న అభివృద్ధి పనులు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు భీంపూర్ గ్రామంలో నిర్వహించిన తెర్వీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, ఉప సర్పంచ్ చౌహాన్ మహేందర్, నాయకులు రాథోడ్ ఉత్తమ్, రాథోడ్ సికిందర్, జాదవ్ రెడ్డి నాయక్, సయ్యద్ కాశీం, రాథోడ్ శివాజీ, సుల్తాన్ఖాన్, హైమద్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.