సారంగాపూర్, జనవరి 9 : రైస్మిల్లో నిలువ ఉన్న బియ్యాన్ని ఈనెల 30వ తేదీ వరకు తరలించాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలోని లక్ష్మీ నరసింహ ఇండ్రస్ట్రీస్ రైస్మిల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైస్మిల్లో ఉన్న బియ్యం స్టాక్, గోదాంలో ఉన్న వరిధాన్యం నిల్వలు ఎంత ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. రైస్మిల్ రిజిస్టర్లు, లారీలో ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్మిల్లో బియ్యాన్ని పూర్తిగా ఖాళీ చేయాలన్నారు. ఆయన వెంట రెవెన్యూ శాఖ అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, డీఎం శ్రీకళ, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో సరోజ, సివిల్ సప్లయ్ అధికారి రవీందర్రెడ్డి, ఆర్ఐ ముంతాజ్ పాల్గొన్నారు.
సృజనాత్మకతను పెంపొందించడమే ధ్యేయం
విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంపొందించడం, ప్రయోగాత్మక విద్యను అందించేందుకు అగస్త్య ఫౌం డేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శాంతినగర్ కాలనీలో గల నిర్మల్ అర్బన్ కేజీబీవీలో నిర్వహించిన మొబైల్ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మొబైల్ ల్యాబ్ను ప్రారంభించారు. ఫౌండేషన్ జీఎం బలరాం, ఏరియా మేనేజర్ శ్రీదేవి, డీఈవో రవీందర్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, ఎంఈవో శంకర్, సెక్టోరియల్ అధికారులు శ్రీదేవి, నర్సయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ పద్మ పాల్గొన్నారు.