మంచిర్యాలటౌన్, మార్చి 14 : మంచిర్యాల పట్టణంలోని రాజీవ్నగర్ ఏరియాలో 345 సర్వేనంబర్లో అక్రమంగా వెలిసిన వెం చర్లలోని హద్దురాళ్లను గురువారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. లేఅవుట్ లేకుండా ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని అం దిన సమాచారం మేరకు నాలుగు చోట్ల చేసిన వెంచర్లలోని హద్దురాళ్లను తొలగించామని, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని టీపీఎస్ సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది సతీష్, సత్యం పాల్గొన్నారు.