బోథ్, డిసెంబర్ 3 : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ ఈఆర్వో వెంకటేశ్వర్లు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈఆర్వో మాట్లాడుతూ బోథ్ నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మండలాల్లోని 302 పోలింగ్ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రాల మార్పు వంటి వాటి కోసం దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కోసం ఆదివారం దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, ఎన్నికల విభాగం డీటీ సూరజ్ ఉన్నారు. బోథ్ మండల పరిధిలోని 49 కేంద్రాలను తహసీల్దార్ అతిఖొద్దీన్, ఆర్ఐ సునీత, దశరథ్, శ్యాంసుందర్రెడ్డి సందర్శించారు.
ముమ్మరంగా చేపట్టాలి
నేరడిగొండ, డిసెంబర్ 3 : ఓటరు నమోదు కార్యక్రమాన్ని మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ముమ్మరంగా చేపట్టాలని బోథ్ నియోజకవర్గ ఈఆర్వో వెంకటేశ్వరు సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు అందుబాటులో ఉంటూ 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి నమోదు చేయాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని పార్టీల నాయకులు ఓటరు నమోదుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ పవన్చంద్ర, సీనియర్ అసిస్టెంట్ మీరాబాయి, ఆర్ఐ నాగోరావ్, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్వోలు పాల్గొన్నారు.
ఇచ్చోడ(సిరికొండ), డిసెంబర్ 3 : ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సిరికొండ తహసీల్దార్ సర్పరాజు అన్నారు. సిరికొండ మండలంలోని సుంకిడి, సిరికొండ, పొన్న గ్రామాల్లో బూతుస్థాయి అధికారుల సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాణి, సుజల, బీఎల్వోలు పాల్గొన్నారు.
నేరడిగొండ, డిసెంబర్ 3 : మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ పవన్చంద్ర సూచించారు. నేరడిగొండ తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిత్రే నారాయణసింగ్, మండల కన్వీనర్ శివారెడ్డి, మండల మాజీ కన్వీనర్ కమల్సింగ్, నాయకులు జాదవ్ మహేందర్, కైలాస్, ఆడె జనార్దన్ పాల్గొన్నారు.