మంచిర్యాల అర్బన్, మార్చి 24 : రేషన్ కార్డుకు ఈకేవై సీ తప్పనిసరి చేస్తూ ఆరు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కార్డుల్లో సభ్యులు చనిపోవడమో లేదా పెండ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లిపోవడమో జరిగినా, చాలా వరకు పేర్లు కార్డులలో అలాగే కొనసాగుతున్నాయి. అలాంటి వాటిని ఏరివేసే కార్యక్రమం ప్ర భుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఆహార భద్రత కార్డులోని సభ్యులందరూ సంబంధిత రేషన్ దు కాణానికి వెళ్లి ఈకేవైసీ(నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రేషన్ లబ్ధిదారుల కార్డుల వివరాలను నవీకరించడం ద్వారా అనర్హులను గుర్తించవచ్చనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకొని అమలు చేసింది. జిల్లా లో 423 రేషన్ దుకాణాలుండగా, వీటి పరిధిలో 2,19,421 (ఏఎఫ్ఎస్సీ 15,490, ఎఫ్ఎస్సీ 2,03,771, ఏఏపీ 160) కార్డులుండగా వీటి పరిధిలో 6,40,989 (ఏఎఫ్ఎస్సీ 47,880, ఎఫ్ఎస్సీ 5,92,948, ఏఏపీ 161) యూనిట్లు ఉన్నాయి. ఇందు లో ఏఏపీ (అన్నపూర్ణ) కార్డుదారులకు ఒక్కో యూనిట్కు 10 కిలోలు, ఏఎఫ్ఎస్సీ (అంత్యోదయ) కార్డుదారులకు ఒక్కో యూనిట్కు 35 కిలోలు, ఎఫ్ఎస్సీ కార్డు లబ్ధిదారులకు ఒక్కో యూనిట్కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. కొన్ని చోట్ల మృతి చెందిన వారి పేరిట ప్రతి నెలా ఉచితంగా రేషన్ తీసుకుంటున్నారు. ఇలాంటి యూనిట్లను ఈకేవైసీతో ఏరివేశారు.
రేషన్ కార్డుల ఆధారంగా యూనిట్లను పరిశీలించనున్నా రు. జిల్లాలో 2,19,421 కార్డులు ఉండగా 6,40,989 యూనిట్లు ఉన్నాయి. ఈ పాస్ మిషన్లో కార్డుదారు ఆ ధార్ నంబర్ నమోదు చేయగానే ఆ కార్డులో ఎందరు ఉన్నారో (ఎన్ని యూనిట్లు ఉన్నాయో) చూపిస్తుంది. వారందరూ ఆధార్తో రేషన్ దుకాణానికి హాజరై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్ధిదారుడు ఆధా ర్ నవీకరణ ఇది వరకే చేసుకుంటే ఆ విషయాన్ని రేషన్ దుకాణంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈకేవైసీకి హాజరు కారో వారి పేరు (ఆయూనిట్)ను హోల్డ్ లో పెడుతున్నారు. వేలి ముద్ర వేసిన వారి పేర్లే కనిపిస్తుంటాయి.
రేషన్ ఈకేవైసీకి 2023, డిసెంబర్ 31 ఆఖరు కాగా అప్పటి వరకు సగం కూడా ఈకేవైసీ ఇవ్వకపోవడం ప్రభుత్వం దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించింది. ఇప్పటి వరకు జిల్లాలో 80.81 శాతం మాత్రమే లబ్ధిదారులు ఆన్లైన్ చేయించుకున్నారు. బెల్లంపల్లి మండలంలో 78.49, భీమినిలో 79.08, చెన్నూర్లో 78.96, దండేపల్లిలో 81, జైపూర్లో 85.65, జన్నారంలో 81.52, కాసిపేటలో 83.87, కోటపల్లిలో 80.97, లక్షెట్టిపేటలో 83.93, మంచిర్యాలలో 78.25, మందమర్రిలో 81.10, తాండూరులో 83.17, వేమనపల్లిలో 80.37, నస్పూర్లో 79.17, హాజీపూర్లో 83.18, భీమారంలో 81.97, కన్నెపల్లిలో 79.23, నెన్నెల మండలంలో 78.95 శాతం రేషన్ లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 80.81 శాతం ఈకేవైసీ కాగా, మిగిలిన వారి కోసం మరో అవకాశం ఇస్తుందా, లేదా ఆ యూనిట్లను తొలగిస్తుందా.. వేచిచూడాల్సిందే.