సీసీసీ నస్పూర్, ఆగస్టు 24: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. శనివారం సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు, వారి సమస్యల గురించి అడిగితెలుసుకున్నారు. కాలనీలు, గ్రామాల్లో జరిగే నేరాలపై ఆరా తీశారు. డయల్ 100 కాల్స్పై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పోలీస్స్టేషన్కు వెళితే సత్వరమే న్యాయం జరుగుతుందనే భావన ప్రజలకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ సుగుణాకర్ పాల్గొన్నారు.