మంచిర్యాల అర్బన్, జూన్ 22 : కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకోవడానికి, సామర్థ్యాలు మెరుగుపరచుకోవడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్వాడ్ ట్రాకింగ్, పేలుడు పదార్థాల గుర్తింపు, యాంటీ-సబోటేజ్ తనిఖీలు, కంప్యూటర్ అవగాహన, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు, వీటిలో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశముంటుందన్నారు.
అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొనే అవకాశముంటుందన్నారు. శాస్త్రీయ దర్యాప్తు, వేలిముద్రల విశ్లేషణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ప్రతిభ కనబరిచిన వారికి జోన్, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే పోలీస్ డ్యూటీ మీట్లలో పాల్గొనే అవకాశం లభిస్తుందని, వివిధ ప్రాంతాల పోలీసు అధికారుల మధ్య పరస్పర సహకారం, ప్రోత్సాహం పెరుగుతుందని పేరొన్నారు.
లోక్ అదాలత్లో 6,545 కేసులు పరిషారం
కమిషనరేట్ పరిధిలో ఈ నెల 20న నిర్వహించిన జా తీయ మెగాలోక్ అదాలత్లో మొత్తం 6,545 కేసులు పరిషారం చేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కే సులను వేగంగా పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నా రు. పెండింగ్ కేసుల పరిషారంతో ప్రజలకు సమ యం, ధనం ఆదా అవుతాయని, ప్రజలు స్వచ్ఛందం గా ముందుకు వచ్చి కేసుల పరిషారానికి సహకరించాలని కోరారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.