నిర్మల్ టౌన్, ఆగస్టు 18 : బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీచైర్పర్సన్ విజయలక్ష్మి సూచించారు. నిర్మల్లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జడ్పీచైర్పర్సన్ మాట్లాడుతూ గోల్కొండ కోట వేదికగా పాపన్నగౌడ్ చేసిన పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, బీసీ వెల్ఫేర్ జిల్లా ఇన్చార్జి అధికారి నాగారావు, గౌడ సంఘం నాయకులు రామకృష్ణగౌడ్, ప్రకాశ్గౌడ్, కృష్ణమోహన్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో..
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జగన్మోహన్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలను స్మరించుకోవాలి
ఎదులాపురం, ఆగస్టు 18 : మహనీయులు చేసిన త్యాగాలు, వారి పోరాటాలు ప్రతినిత్యం స్మరించుకోవాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ నటరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్డడీ సర్కిల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ జీవితం యువతకు ఆదర్శమని అన్నారు. పట్టణంలో పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బస్టాండ్ సమీపంలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీబీసీడీవో రాజలింగు, ఎక్సైజ్ సీఐ సీహెచ్ శ్రీనివాస్, కౌన్సిలర్ భరత్, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ శంకర్గౌడ్, నర్సాగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, పార్థసారథి, కార్యనిర్వాహక అధ్యక్షుడు చిక్కల దత్తు, విగ్రహ ఏర్పాటు కమిటీ అధ్యక్షుడు భూమాగౌడ్, ఉపాధ్యక్షుడు సంతోష్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రధానకార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, కోశాధికారి సాయిచైతన్య గౌడ్, కమిటీ సభ్యులు దినేశ్ గౌడ్, చరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.