నిర్మల్ చైన్గేట్, డిసెంబర్,10: పేద ప్రజలు ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల దవాఖానలో ఆదివారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య శ్రీ పథకం సేవలను ప్రారం భించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, సూపరింటెండెంట్ సునీల్, డీఎం హెచ్వో ధన్రాజ్, డా.శ్రీనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ భారతి, కమిషనర్ సీవీఎన్ రాజు, స్థానిక కౌన్సిలర్ మజ్దు చౌస్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 10 : నిర్మల్లోని ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకాన్ని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈపథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఉచితంగా ప్రయాణించవచ్చని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సు ల్లో ఉచిత ప్రయాణాన్ని సర్కారు కల్పించిందని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ చాహుస్, మున్సిపల్ కమిషనర్ రాజు, డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి శివ, భూపతి అధికారులు నాయకులు పాల్గొన్నారు.
భైంసా, డిసెంబర్ 10 : భైంసా బస్టాండ్లో మహాలక్ష్మీ పథకాన్ని అధికారులు ప్రారంభించా రు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మోజామ్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, ట్రాఫిక్ సూపర్వైజర్ శిరీష, నారాయణ, చంద్ర య్య, ఆర్టీసీ సిబ్బంది తదితరులు ఉన్నారు.