దహెగాం, డిసెంబర్30 : మండలంలో ప్రజాపాలన గ్రామసభలు కొనసాగుతున్నాయి . శనివారం తహసీల్దార్ బృందం ఒడ్డుగూడ, చిన్నరాస్పల్లి, ఎంపీడీవో బృందం ఇట్యాల, బోర్లకుంట పంచాయతీల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించి దరఖాస్తు ఫారాలు అందజేయడంతోపాటు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీడీవోలు మాట్లాడారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ఈ కార్యక్రమం జనవరి 6వరకు కొనసాగుతుందన్నారు. దరఖాస్తులను జాగ్రత్త నిం పాలని వారు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
వాంకిడి,డిసెంబర్28: అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తహసీల్దార్ రహీమొద్ధీన్ అన్నారు.శనివారం మండలంలోని లక్ష్మిపూర్ గ్రామపంచాయతీ ఆవర్ణలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సర్పంచ్ నీలబాయి,ఏవో మిలింద్కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో అర్హులైన ప్రతి ఒకరూ ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసు కోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.
రెబ్బెన, డిసెంబర్ 30: మండలంలోని 24 గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రజాపాలన ఆరు గ్యారెంటీ స్కీంలకు సంబంధించిన దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని ఎంపీడీవో పరికిపండ్ల శ్రీనివాస్, తహసీల్దార్ సమీర్లు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం 94 కౌంటర్లు ఏర్పాటు చేశామని, సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి దరఖాస్తు ఫారాలు అందించి నింపిన ఫారాలు స్వీకరించి రసీదు అందిస్తున్నారని తెలిపారు.
దరఖాస్తు ఫారాలు ఎవరైనా డబ్బులకు అమ్మినా, ఫారం నింపడానికి డబ్బులు తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దరఖాస్తు ఫారంలో ప్రతి ఒక్క కాలం క్షుణ్ణంగా చదివి నింపాలని సూచించారు. రేషన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే వారు తెల్లకాగితంపై పూర్తి వివరాలతో అప్లికేషన్ రాసి అందించాలని సూచించారు. దళారుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సిబ్బందిని అడిగితే అన్ని వివరాలు చెబుతారని పేర్కొన్నారు.
చింతలమానేపల్లి, డిసెంబర్ 30 : రవీంద్రనగర్-1,2 గ్రామాల్లో శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీపీ డుబ్బుల నానయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాపాలన కార్య క్రమాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్య క్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, మండ ల ప్రత్యేక అధికారి కుటుంబరావు, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ నాగరాజ్గౌడ్ డిప్యూటీ తహసీల్దార్ మస్కుర్ అలీ, సర్పంచ్లు, ఎంపీ టీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారు లు, తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, డిసెంబర్ 30: అర్హులైన పేదలకు సర్కారు అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు లబ్ధి చేకూర్చడం కోసమే ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నామని ఆసిఫాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ స్పష్టం చేశారు. మండలం లోని గోలేటి, పులికుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను సందర్శించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి తప్పకుండా చేరుతాయన్నారు. ప్రజలు దరఖాస్తులు ఎలాంటి తప్పులు లేకుండా నింపి ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ జత చేసి కౌంటర్లలో అందించి తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లావు డ్య రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవాజీ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ గాజుల రవీందర్, మాజీ ఎంపీటీసీ సురేందర్రాజు, నాయకులు దుర్గం రవీందర్, మోడెం చిరంజీవిగౌడ్, పూదరి సాయి పలువురు ఉన్నారు.
సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ఐదు గ్యారెంటీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని రెబ్బెన స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. శనివారం నంబాల, ధర్మారం, ఖైర్గూడ, పులికుంట గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామసభలకు స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్తో పాటు ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ సమీర్లు హాజరై మాట్లాడారు.
జనవరి 6వ తేదీ వరకు ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, పీఏసీఎస్ ఛైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్, సర్పంచ్లు చెన్న సోమశేఖర్, బుర్స పోశమల్లు, ఎంపీటీసీ సంగం శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీవో అంజాద్పాషా, ఎఎస్ఐ లక్ష్మణ్, ఎపీఎం రాజ్కుమార్, ఎపీవో బుచ్చన్న, ఏఈ ఇమ్రాన్, పలువురు ఉన్నారు.
పెంచికల్ పేట్, డిసెంబర్ 30: ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ సూచించారు. శనివారం మండలంలోని అగర్ గూడలో తహసీల్దార్ బృందం, కమ్మర్గాం, మొర్లి గూడలో ఎంపీడీవో బృందం గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఉచిత దరఖాస్తులను అందజేస్తున్నామని వాటిని పూర్తి సమాచారంతో మీ మీ జీపీల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందజేయాలని తెలిపారు. శనివారం మండల వ్యాప్తంగా దాదాపు 1220 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో గంగాసింగ్ సర్పంచ్లు సుధాకర్, మధునయ్య, ఈశ్వరి బాయ్, అధికారుల బృందం తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ ,డిసెంబర్30: రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ అన్నారు. శనివారం మండలంలోని చొర్పల్లి, గుండి, తుంపెల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొని దరఖాస్తుల కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణం గా పరిశీలించి అర్హులైన లబ్ధిదారుల అందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని సూచించారు. సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్, ఏఎంసీ మాజీ చైర్మన్, గుండి ఎంపీటీసీ గాదవేని మల్లేశ్, డిప్యూటీ తహసీల్దార్ పోచయ్య, మాజీ ఎఎంసీ చైర్మ్న్ గంధం శ్రీనివాస్, ఎంపీడీవో శశికల, ఎంపీవో ప్రసాద్, ఏపీవో చంద్రశేఖర్, కార్యదర్శులు పాల్గొన్నారు.