ఆదిలాబాద్: పోలీసు సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (Akhil Mahajan) సూచించారు. పోలీసు వ్యవస్థకు క్రమశిక్షణ తప్పనిసరి అని, ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పరేడ్ నిర్వహిస్తామని, దీనివల్ల సిబ్బంది ఒకరి మధ్య ఒకరికి మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు. అదేవిధంగా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఉండాలని తెలిపారు. పరేడ్ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు చెడు వ్యసనాల జోలికి వెళ్లకూడదని ఆదేశించారు.
పరేడ్ తర్వాత సిబ్బంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా తెలియని వ్యక్తులకు పూచికత్తులు (ష్యూరిటీ) ఇవ్వకూదని స్పష్టం చేశారు. 50 ఏండ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగ శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. పరేడ్లో భాగంగా సిబ్బంది అందరికీ ఆయుధాలపై, వాటి వినియోగంపై, ట్రాఫిక్ సిబ్బందికి సిగ్నల్స్పై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బీ. సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్, కే. ఫణి ధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టీ.మురళి, బీ.శ్రీపాల్, ఎన్.చంద్రశేఖర్, ఎస్ఐ విష్ణువర్ధన్, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.