ఆదిలాబాద్, సెప్టెంబరు 15 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : దివంగత పోలీస్ అధికారి యడవల్లి రమేశ్బాబు సేవలు మరువలేనివని 1996 బ్యాచ్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఇచ్చోడ సీఐగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో రమేశ్బాబు మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు. సీఐ రమేశ్బాబు స్వగృహంలో జరిగిన సంస్మరణ సభలో 1996 కు చెందిన పోలీస్ అధికారులు రమేశ్బాబుకు ఘన నివాళుల ర్పిం చారు. ఈ కార్యక్రమంలో ఆయన మిత్రులు మాట్లాడుతూ రమేశ్బాబు ప్రజలకు, పోలీస్ శాఖకు అత్యుత్తమ సేవలందించారని పేర్కొన్నా రు. 1996లో పోలీస్శాఖలో ఎస్ఐగా విధుల్లోకి చేరిన రమేశ్బాబు హాజీపూర్, భీమిని, ఖార్జానా ట్రాఫిక్, సిర్పూర్(టీ) పోలీస్ స్టేషన్లలో పని చేశారని గుర్తు చేశారు. 2011లో సీఐగా ప్రమో షన్ పొంది కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల, హన్మకొండ ట్రాఫిక్, కాగజ్నగర్ రూరల్, మణు గూరు, నిర్మల్ క్రైం బ్రాంచ్, ఇచ్చోడలో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఆయన ఎక్కడ పని చేసినా బాధితులకు న్యాయం చేసుందుకు ముందు వరుసలో ఉండేవారన్నారు.
రమేశ్బాబు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేశారని పేర్కొ న్నారు. పలువురికి ఆదర్శంగా నిలిచారని, సమర్థ వంతమైన అధికారిని పోలీస్ శాఖ కోల్పో యింద ని తెలిపారు. 1996 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్ర దేశ్, తెలంగాణ పోలీస్ అధికారులు రమేశ్బాబు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. రెండు రాష్ర్టాల్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆయన బ్యాచ్ అధికారులు రూ.25,00,116 చెక్కును రమేశ్బాబు కుటుంబ సభ్యులకు అందజేశారు. సెప్టెంబర్ 1, 2021న ఇచ్చోడ సీఐగా విధుల్లోకి చేరిన రమేశ్బాబు ఏడాది కాలం పాటు పనిచేశారు. ప్రజల సమ స్యల పరిష్కారంతోపాటు శాంతిభద్రతలు కాపా డేందుకు ఎంతో కృషి చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలను ఆయన విజయవంతంగా అమలు చేశారు. జిల్లా లో వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుకుండా చర్యలు తీసుకున్నారు. రమేశ్ బాబు కుటుంబసభ్యులను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.