నిర్మల్ టౌన్, జూన్ 15 : నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 396 పంచాయతీల్లో క్రీడా ప్రాంగాణాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 160 గ్రామాల్లో మాత్రమే ప్రాంగణాలు సిద్ధమైనట్లు తెలిపారు.
ఇంకా స్థలాలు గుర్తించని గ్రామాలు, పనులు ప్రారంభించని పంచాయతీల్లో ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ఈనెల 20లోగా ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత, డిప్యూటీ సీఈవో శంకర్, ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.