నార్నూర్ : ఆధ్యాత్మికత, భగవంతుని స్మరణ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భాగం కావాలని అప్పుడే మానసిక ప్రశాంతత సాధ్యమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గురువారం మండలంలోని గంగాపూర్ గ్రామంలో జగదాంబ దేవీ, సేవాలాల్ మహారాజ్ మందిరాలను ప్రారంభించారు. ఆలయంలో విగ్రహాలు, కలశాలను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లు, సమస్యలకు ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకురుతుందని, భగవంతుని స్మరణ ద్వారా సార్థకత కలుగుతుందన్నారు.
అందరి సహకారంతో గంగాపూర్లో జగదాంబ దేవీ , సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించడం హర్షనీయమన్నారు. గ్రామస్తులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఐక్యమత్యంతో ఉన్నతి వైపు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యుర్వేత రూప్దేవ్, ఎంపీపీ కనక మోతుబాయి, ఎంపీటీసీ ఏత్మాబాయి, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, నాయక్ రాథోడ్ యశ్వంత్రావ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యూన్సీఅక్భానీ, శ్రీరామ్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, నార్నూర్ సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్,నార్నూర్ సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, రాథోడ్ బాబులాల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.