ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా పని చేస్తున్నారని రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ చేసి, సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని వారు పేర్కొన్నారు. ఈ పాలాభిషేకంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ప్రధాన కార్యదర్శి తోట రాము తదితరులు ఉన్నారు.
– భైంసా, ఆగస్టు 6