కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్, డిసెంబర్ 29 : మహారాష్ట్ర నుంచి రోగులు వచ్చి మన రాష్ట్రంలో వైద్యం చేయించుకుంటున్నారని వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మాత్యులు తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో గురువారం మంత్రులు ఐకే రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి 30 పడకల దవాఖానను హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ మాత్రమే ఉండేదని.. ఇప్పుడు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు కూడా మం జూరు చేశామని పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే మెడికల్ కళాశాలను ప్రారంభించాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, బా లింతలకు కేసీఆర్ కిట్లు, పిల్లల ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం. పుట్టుక నుంచి పెండ్లి వరకు ప్రభుత్వం పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. పౌష్టికాహార కిట్లతోనే గర్భిణుల్లో రక్తహీనత తగ్గి సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్నగర్లలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా బస్పాస్లు, పెన్షన్స్ కూడా ఇస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా డయేరియా, పల్లె ప్రగతి ద్వారా మలేరియా వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.
రాష్ట్ర సర్కారు 950 వైద్యుల పోస్టులు భర్తీ చేయనున్నదని, వీరిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమిస్తాం. జిల్లాలో 90 ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలను పల్లె దవాఖానలుగా మారుస్తాం. వీటితో మారుమూల పల్లెల్లోని ప్రజలకు కూడా నిరంతర వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు.