నిర్మల్ అర్బన్, డిసెంబర్ 10 : మహిళలకు అండగా సఖీ కేంద్రం నిలుస్తున్నదని నిర్వాహకురాలు పీ మమత అన్నారు. నిర్మల్ జిల్లాలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమాన్ని పురస్కరించుకొని గత నెల 25 నుంచి ఈ నెల 10 వరకు పక్షోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా మహిళలు, విద్యార్థులు, యువతులను అప్రమత్తం చేవారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పక్షోత్సవాల్లో భాగంగా బాలికలు, స్త్రీల హక్కుల గురించి, సైబర్ క్రైమ్స్, మానవ అక్రమ రవాణా నివారణ, బాలిక చట్టాలను వివరించారు. ఎలాంటి సందర్భంలోనైనా సఖీ కేంద్రం తోడుగా ఉంటుందని చెప్పారు. మహిళలపై దాడులు, లైంగికదాడులు, ఇతర ఘనటలు చోటు చేసుకున్నా 181కు కాల్చేస్తే తక్షణమే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మహిళలపై జరిగిన దాడుల్లో అనేక మందికి శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.