ఎదులాపురం, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం త్రివర్ణ శోభితమైంది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని గురువారం అన్ని కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బంగ్లాలో జాతీయ జెండాను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎగురవేశారు. జాతీయ గీతాలాపన చేసి జెండా వందనం చేశారు. ముందుగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఎస్పీ క్యాంపు, పోలీస్ ముఖ్య కార్యాలయాల్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. హెడ్క్వార్టర్స్లో అదనపు ఎస్పీ శ్రీనివాస రావు, జిల్లా కోర్డులో ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, జడ్పీ కార్యాలయ ఆవరణలో జడ్పీ సీఈవో గణపతి, వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీవో శ్రీనివాస్, ఐసీడీఎస్, సఖీ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, సంక్షేమ కార్యాలయంలో బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంతో అధికారి పుల్లయ్య, డీఆర్డీఏ కార్యాలయంలో జిల్లా అధికారి కిషన్ , ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఈడీ శంకర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఎదులాపురం, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్లోని శాంతినగర్, బస్టాండ్ వద్ద జిన్నింగ్ అండ్ అయిల్ మిల్ అసోసియేషన్, ఆదిలాబాద్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్, లారీ డ్రైవర్స్ అసోసియేషన్, ట్రాలీ యూనియన్, ఆటో మొబైల్స్ యూనియన్, హమాలీ యూనియన్, ఆటో డ్రైవర్స్ యూనియన్, అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీచౌక్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ నగేశ్తో కలిసి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జైనథ్ ఎంపీపీ గోవర్థన్, పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, శైలేందర్, రాజు, జగదీశ్, కస్తాల ప్రేమల, మమత, దాసరి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, జనవరి 26 : గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ కృషి చేస్తున్నదని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను ఇతర ప్రాంతాలతో పోటీ పడేలా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాల పెంపునకు అక్షర జ్యోతి కార్యక్రమం నిర్వహణ, గిరిజన మహిళలలో రక్తహీనత సమస్యలు అధిగమించేందుకు గిరి పోషణ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. యువతకు రానున్న పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, ఏపీఓ జనరల్ భీంరావ్, ఈఈ భీంరావ్, ఏవో రాంబాబు, పీవీటీజీ ప్రత్యేకాధికారి భాస్కర్, ఏజెన్సీ అడిషనల్ డీఎంహెచ్వో బాలు, సీడీపీవో శ్రావణి, జేడీఎం నాగభూషణం, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, గురుకులం ఆర్సీవో గంగాధర్, ఏసీఎంవో జగన్, ఏటీడీవో క్రాంతి, సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు.