నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసినందుకు శనివారం పొన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ..
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పది గ్రామాల ప్రజల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. పొన్కల్ను నూతన మండలంగా ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు ఐకే రెడ్డి, కేటీఆర్, హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
– మామడ, సెప్టెంబర్ 30