భైంసా : భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ముథోల్ నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతుల గురించి ప్రస్తావించారు. మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో సోయా, పత్తి, ఇతర పంటలు దెబ్బితిన్నాయని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
పలు చోట్ల రోడ్లు, కల్వర్టు, అంతర్గత రహాదారులు దెబ్బతిన్నాయని వీటి పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.