ముథోల్/కుభీర్/భైంసా, ఆగస్టు 19 : అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ముథోల్, కుభీర్, భైంసా మండలాల్లో పర్యటించారు. ముథోల్ మండలంలోని ఆష్టా గ్రామానికి చెందిన 38మందికి శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆసరా పింఛన్ కార్డులను, మండలానికి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, ఎంపీడీవో సురేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్రెడ్డి, సర్పంచ్ రాంరెడ్డి, ఆష్టా గ్రామ సర్పంచ్ సుకన్య, రోళ్ల రమేశ్, మగ్దూమ్ పాల్గొన్నారు. అనంతరం నయాబాది చౌరస్తాలో పాపన్నగౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్యాంసుందర్, సర్పంచ్ రాజేందర్, గౌడ సంఘం సభ్యులు ఆకుల మురళీ గౌడ్, తిరుపతి గౌడ్, అంజిగౌడ్, దత్తాత్రేయ గౌడ్ పాల్గొన్నారు. కుభీర్ మండలంలో 11మంది లబ్ధిదారులకు శుక్రవారం మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అంతకు ముందు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా కానోబా గల్లీలోని ఆలయంలో రూ.2లక్షలతో నిర్మించిన ధ్యాన గదిని ప్రారంభించారు. నాయకులు తూం రాజేశ్వర్, శంకర్ చౌహాన్, దత్తుగౌడ్, నాగలింగం, మహిపాల్రెడ్డి, దత్తురాం పాల్గొన్నారు. భైంసా ప్రభుత్వ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులకు ఎమ్మెల్యే పండ్లు పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ.కృష్ణ, ఆర్డీవో లోకేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ అలీం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డా.కాశీనాథ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పారుఖ్ హైమద్, ఆళా, సూరి పాల్గొన్నారు.