నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 15 : దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని నిర్మ ల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు సైతం ఆటల్లో పాల్గొని విజయం సాధించాలన్నారు. క్రీడల వల్ల మానసికోల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు.
అంతకుముందు కలెక్టర్కు విద్యార్థులు, దివ్యాంగులు ఘన స్వాగతం పలికారు. క్యారమ్స్, పరుగుపందెం, చెస్, పలు క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రమేశ్, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్రెడ్డి, సిబ్బంది శ్రీరామ్మూర్తి, ఇజాజ్, స్వాతి, మధుసూదన్రెడ్డి, నిరంజన్రెడ్డి, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు సట్టి సాయన్న, ఇసాక్ అలీ, సాక్పెల్లి సురేందర్, క్రాంతి కుమార్, మహేశ్, శ్రీనివాస్, నర్సయ్య, అమ్జద్, యాదగిరి, రమేశ్రెడ్డి, భగవాన్, పుష్ప, సత్యనారాయణ, గంగాధర్, దివ్యాంగులు పాల్గొన్నారు.