వేమనపల్లి, ఫిబ్రవరి 25 : వేమనపల్లి మండ లం బుయ్యారం గ్రామంలోని గుడుంబా స్థావరాలపై నీల్వాయి పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం గుడుంబా దాడులు నిర్వహించారు. చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్రెడ్డి, చెన్నూరు ఎక్సైజ్ సీఐ హరి, మంచిర్యాల డీటీఎఫ్ సీఐ సమ్మయ్య, ఎక్సైజ్ ఎస్ఐలు రమణ, శారద గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దాడులు చేశారు.
వారు మాట్లాడుతూ బుయ్యారం గ్రామంలో గుడుంబా తయారు చేసి బైక్ల ద్వారా సమీప గ్రామాలకు తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేశామని, గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించగా 20 గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించామని, 5 వేల లీటర్ల గుడుంబా పానకాన్ని ధ్వంసం చేశామన్నారు.