ఇంద్రవెల్లి, జనవరి 30 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం జాతర హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం ఆదాయం రూ.21 లక్షల 37 వేల 13 వచ్చిందని దేవాదాయ శాఖ ఈవో రాజమౌళి తెలిపారు. గత సంవత్సరం భక్తులు హుండీలో వేసిన కానుకలు రూ. 6 లక్షల 19 వేల 441 ఉండగా, ఈ సంవత్సరం రూ.8 లక్షల 94 వేల 835 వచ్చాయి. ఈ సంవత్సరం రూ.2 లక్షల 75వేల 394 ఆదాయం పెరిగింది. గత సంవత్సరంలో తైబజార్ ద్వారా రూ.6 లక్షల 95 వేలు ఉండగా, ఈ సంవత్సరం రూ.12 లక్షల 42 వేల 178 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. వెండి 340 గ్రాములు సమకూరిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్, ఏఎస్ఐ భీంరావ్, ఆర్ఐ లక్ష్మణ్, దేవాదాయశాఖ సీఎఫ్వో రవికుమార్, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, మెస్రం వంశీయుల పెద్దలు బాజీరావ్పటేల్, దాదారావ్, నాగోబా పేన్ కొత్వాల్ తిరుపతి, కటోడ కోసుక, కటోడ కోసేరావ్, హనుమంత్రావ్, మెస్రం వంశీయుల ఉద్యోగుల సంఘం నాయకులు, ఆలయ పూజారి షేకు, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.